రంజుగా సాగుతున్న రమ్య ప్రచారం
ఎన్నికలు
వచ్చిందంటే చాలు రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సినీ గ్లామర్ ని
అద్దుతాయి. వారితో ప్రచారం చేయించి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు
చేస్తాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సినీ నటి రమ్య ఎన్నికల ప్రచారానికి నడుంబిగించింది. ఈమె గతంలో నుండే కాంగ్రెస్
పార్టీకి చెందినదే అయినా ఇన్నిరోజులు ప్రచారానికి దూరంగా ఉంది. ఎన్నికల
సమయం దగ్గర పడుతుండటంతో ఆపార్టీ ఆదేశాల మేరకు రమ్య రంగంలో దిగింది. ఆమె
శివాజీ నగర నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రోషన్ బేగ్
తరుపున ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు జనాల నుండి మంచి
రెస్పాన్స్ రావడంతో రమ్య తెగ ఆనందంలో ఉంది. రమ్య మాట్లాడుతూ... ‘ఎన్నికల
ప్రచారంలో ఆలస్యంగా పాల్గొంటున్నట్లు వస్తున్న విమర్శల్లో వాస్తవంలేదు.
ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణకు లండన్ వెళ్లాను. ఇటీవలే వచ్చాను. పార్టీ
నాయకుల సూచన మేరకే ఏయే ప్రాంతాల్లో పర్యటించేదీ నిర్ణయిస్తాను అని
తెలిపింది. రమ్య ప్రచారానికి ఏ మాత్రం ఓట్లు రాలుతాయో చూడాలి.
No comments:
Post a Comment