అవినీతి మీద బహిరంగ చర్చకు బాబు సిద్ధం
వస్తున్నా
మీకోసం కార్యక్రమంలో రెండు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభించిన
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పాలనలోని అవినీతి మీద టివిలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ కి సవాల్ విసిరారు.
ఎస్
సి ఎస్ టి సబ్ ప్లాన్ కి ప్రతిపక్షాలు (తెదేపా) అడ్డుకుంటున్నాయని అంటున్న
ముఖ్యమంత్రి అందుకు క్షమాపణ కోరాలని చంద్రబాబు అన్నారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎస్ సి ఎస్ టి లకు చెందిన 22500 కోట్ల రూపాయలను దారిమళ్ళించారని చంద్రబాబు విమర్శించారు.
వైయస్
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను అవిశ్వాస తీర్మానం పెట్టిన
సమయంలో కాంగ్రెస్ పార్టీ లో ఛీఫ్ విప్ గా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్
రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిని సమర్థించారని, ఏనాటికైనా కాంగ్రెస్, వైయస్ ఆర్
కాంగ్రెస్ ఒకటేనని చంద్రబాబు అన్నారు.
ఆ
సమయంలో సోనియా గాంధీ నుంచి ఒక సందేశం వచ్చుంటే చాలు రాజశేఖర రెడ్డి
అవినీతి ఆగిపోయుండేదని, అలా కాకుండా ఆమె ప్రోత్సహించబట్టే రాజశేఖరరెడ్డి
అవినీతి అలా మితిమీరిపోవటం జరిగిందని చంద్రబాబు అన్నారు. రాజశేఖర్
రెడ్డి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్ధిక నేరాలను ఆపలేకపోయారని,
అందుకు ఫలితంగానే జగన్ జైల్లో ఉన్నాడని చంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి
చెప్పటం వలనే గుడ్డిగా సంతకాలు పెట్టానంటున్న మంత్రులు అవినీతిలో ఎంత వాటా
అందుకున్నారో ప్రజలు ఊహించగలరని, తనమీద నమ్మకం ఉంటేనే ఓటెయ్యండని అంటూ
చంద్రబాబు రాష్ట్రప్రజలను కోరారు.

No comments:
Post a Comment