Tuesday, 9 April 2013

Sobhita Dhulipala Femina Miss India


Sobhita-Dhulipala.gif
Sobhita Dhulipala Femina Miss India 2013

 భారతదేశ అందాల పోటీల్లో  అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫాండ్స్ ఫెమినా మిస్ ఇండియా’ (ఫి.ఎఫ్.ఎం. ఐ) పోటీల్లో  విశాఖ పట్నానికి చెందిన  ధూళిపాల శోభిత మొదటి రన్నరప్ గా నిలిచి మిస్ ఇండియా (ఎర్త్) కిరీటాన్ని  సాధించి  చరిత్ర స్రుష్టించారు. ఆ కిరీటాన్ని  దక్కించుకున్న  మొట్టమొదటి విశాఖ  యువతిగా రికార్డు  నమోదు చేశారు. పాండ్స్ ఫెమినా పోటీలో మిస్ ఇండియా(ఎర్త్)గా కిరీటం సాధించిన శోభిత గుంటూరు జిల్లా తెనాలిలో 1992 జూన్ 15న జన్మించింది. తండ్రి వేణుగోపాలరావు మెరైన్ ఇంజనీర్. తల్లి శాంతా కామాక్షి టీచర్. ప్రస్తుతం ముంబైలోని హెచ్ఆర్ కాలేజీలో 'కామర్స్ అండ్ ఎకనామిక్స్'లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న శోభిత.. 2007లో విశాఖ వ్యాలీ స్కూల్‌లో ఎంఈసీలో చేరింది.   అప్పట్లోనే థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్లినప్పుడు.. మిస్ ఇండియా గా గెలుస్తానని చెప్పింది. శోభిత లక్ష్యసాధన కోసం ఆమె తల్లిదండ్రులు విశాఖ నుంచి ముంబైకి మకాం మార్చారు. ఈ పోటీలకు ముందు జనవరిలో.. శోభిత మిస్ బెంగళూరుగా ఎంపికైంది.

Sobhita Dhulipala Femina Miss India 2013


అంతకుముందు య మహా రే ఫెమినా 'మిస్ అడ్వెంచర్'గా, 2012లో మ్యా క్స్ ఫెమినా 'మిస్ ఫ్యాషన్ ఐకాన్'గా, ట్రెసిమ్ ఫెమినా పోటీల్లో 'మిస్ స్టైలిష్ హెయిర్-2013'గా ఎంపికైంది. శోభిత సాహసి. స్పష్టమైన ఆలోచనలు, లక్ష్యం గల అమ్మాయి. ఇంటర్‌లో అంతా ఇంజనీరింగ్, మెడిసిన్ అంటుంటే.. తాను 'మిస్ ఇండియా'ను టార్గెట్‌గా పెట్టుకుంది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె మరిన్నిఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నారు. 

No comments:

Post a Comment