Tuesday, 16 April 2013

Akbaruddin Owaisi Slapped Non Bailable Warrant

  అక్బరుద్దీన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్ 
 
 akbaruddin-owaisi.png

గతంలో నిర్మల్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్ఐఎమ్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసి అదిలాబాద్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు రాగా, రంగారెడ్డి జిల్లా కోర్టు అక్బరుద్దీన్ కి నాన్ బెయిల్ వారంట్ జారీచేసింది.  విచారణ మే 8 కి వాయిదా పడింది.  
నిర్మల్ లో చేసిన వివాదస్పద ప్రసంగం వలన అరెస్ట్ కు గురై 40 రోజుల తర్వాత ఆరోగ్య కారణాల మీద షరతులతో కూడిన బెయిల్ పొంది అక్బరుద్దీన్ షరతు ప్రకారం పాస్ పోర్ట్ ను ప్రభుత్వానికి స్వాధీనపరచి హైద్రాబాద్ నివాసానికి తిరిగి వచ్చేసారు.
అయితే, కర్మన్ ఘాట్ కి చెందిన బాలమ్ ఈశ్వర్ యాదవ్ అనే అతను రంగారెడ్డి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వెయ్యగా, రంగారెడ్డి జిల్లాలో అతని వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి, నమోదు చేసిన చార్జ్ షీటు మీద అక్బరుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చెయ్యబడింది. 

No comments:

Post a Comment