క్రికెట్
బుకీలు క్రికెటర్లను ఎంత తొందరగా ముగ్గులోకి దింపుతారో అంతే జాగ్రత్తగా
వ్యవహరిస్తారు. మాయమాటలు చెప్పి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన
క్రికెటర్లు అయిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చౌహాన్ లు బుకీలతో కలిసి
స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో
కొన్ని కీలక విషయాలు బయటకి వస్తున్నాయి.
క్రికెటర్లకు డబ్బుతో పాటు
అమ్మాయిలను సరఫరా చేసిన బుకీలు వ్యవహారంలో ఏదైనా తేడా కొడితే వారిని తమ
ఆధీనంలో ఉంచుకోవడానికి వారు అమ్మాయిలతో రాసలీలలు సాగించే సమయంలో వీడియాలు
కూడా తీసి ఆ టేపులను తమ వద్ద ఉంచుకున్నారని, మొన్న హోటల్ గదిలో ఓ
అమ్మాయితో ఎంజాయ్ చేస్తుండగా బుకీలు వీడియో కూడా తీసినట్టు పోలీసులు
స్వాధీనం చేసుకున్న లాప్ టాప్ లలో ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుందని
అంటున్నారు.
ఇందుకోసం బుకీల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్
ట్యాపులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. అక్కడి నుంచి నివేదిక వస్తే
గానీ వాటిలో ఉన్న రహస్య సమాచారం వెలుగు చూడనుంది. ఒకవేళ అందులో క్రికెటర్లు
ఉంటే వీరికి మరిన్ని చిక్కులు మాత్రం తప్పవంటున్నారు.

No comments:
Post a Comment