Saturday, 19 July 2014

Datawind Company Presenting One Year Internet Free



Telugu Content
 
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కొన్ని తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేంద్రాన్ని చేజిక్కించుకున్న ఎన్డీయే.. తమ ప్రస్థానాన్ని జీవితకాలం వరకు కొనసాగించుకోవాలనే నేపథ్యంతో ముందుకు దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యువకుల్ని తమవైపుకు ఆకర్షించుకోవడం కోసం కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో కూడిన పథకాలను ప్రవేశపెట్టబోతోంది.

అలాగే భారత ప్రభుత్వానికి ఆకాశ్ ట్యాబ్లెట్లను సరఫరా చేస్తున్న డేటావిండ్ సంస్థ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది...... Read More.....

First Innings India Vs England Cricket Match In Lords Ground


lords-ground.gif
ప్రస్తుతం భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 295 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అందులోనూ అజింక్యా రహానే 103 పరుగులతో అద్భుతంగా ప్రదర్శించడం వల్లే భారత్ ఆ స్కోరును నమోదు చేసుకోగలిగింది. దీంతో అజింక్యా రహానే కూడా ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మన భారత్ తరఫున్ లార్డ్స్ మైదానంలో సెంచరీలు చేసిన వీరులు చాలా తక్కవమందే వున్నారు. అందులో ముందుగా సచిన్ పేరు రాగా... మిగతా ఒకరో ఇద్దరో వున్నారు. ఇప్పుడు అజింక్యా రహానే కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు...... Read More.......

Union Government Questions About State Councils


రాష్ట్రాలకు శాసన మండలి అవసరమా అని కేంద్ర ప్రభుత్వం అడగోతోంది.  కొన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళున్నాయి, కొన్ని రాష్ట్రాలలో లేవు.  అన్ని రాష్ట్రాలలో ఒకే పద్ధతిలో జరగాలి కదా అంటోంది కేంద్రం.  దీని మీద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మోదీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. 

ప్రస్తుతం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు మండళ్ళు వద్దని చెప్పినట్లయితే భవిష్యత్తులో శాసన మండళ్ళు కనుమరుగైపోతాయి.  ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి.  కొత్తగా అస్సోం, రాజస్తాన్ రాష్ట్రాలు శాసన మండలిని ప్రారంభించటానికి అనుమతి కోరటంతో అసలు ఈ మంఢళ్ళు అవసరమా అనే ప్రశ్న కేంద్ర సర్కార్ కి మొదలైంది.  Read More.
.......

Friday, 18 July 2014

Jobs In Ntpc

jOB-IN-nTPC.gif
1. పోస్ట్ - ఎలక్ట్ట్రిషియన్ ఆర్టిసన్ ట్రైనీ ఉద్యోగాలు - ఖాళీలు –  55

2. పోస్ట్ - ఆర్టిసన్ ట్రైనీ (Fitter) - ఖాళీలు –  30

జీతం – 11500-3%-26000 .... Read More.....

Andhra Pradesh Capital Undecided But Leaked

 
ap.gif
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అన్నది వ్యాపార రీత్యా స్థిరాస్థి వ్యాపారులకు, స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేవారికి, కొత్తగా వ్యాపార, సేవా సంస్థలను నెలకొల్పాలనుకునేవారికి ఉత్కంఠను ఎక్కువగానే కలిగించినా, రాష్ట్ర ప్రజలకు కూడా తమ రాజధాని ఎక్కడో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంటుంది.  ఇంతవరకు ఎక్కడో తెలియకపోతే ఇక దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవాలన్నది వారి ఆత్రుతకు కారణమవుతోంది....... Read More......
ఆం.ప్ర. రాజధాని విషయంలో బ్రెయిన్ వాష్?

Microsoft Corporation Layoffs Of 18 000 Employees Begin

microsoft-corporation layoffs of 18 000 employees begin.gif

ప్రపంచలోనే అతి పెద్ద సంస్థ మైక్రోసాప్ట్, మా అబ్బాయి మైక్రోపాస్ట్ ఉద్యోగి అని చెప్పుకొని.. ఆనందపడిన తల్లిదండ్రులను మనం చూసే ఉంటాం. కానీ ఇకనుండి అలా కాదు.. మా అబ్బాయి జీవితంలో మైక్రోసాప్ట్ సంస్థ చీకటి నింపింది అని చెప్పుకునే తల్లిదండ్రులు తయరవుతారు. 39 ఏళ్ల చరిత్రలో ఎన్నడు జరగని విధంగా ఉద్యోగుల పై వేటు వేయటానికి మైక్రోసాప్ట్ సంస్థ సిద్దంగా ఉంది.... Read More.....

Indian Batsman Ajinkya Rahane Has Played Wonderful In 2nd Test Match

 
India-vs-England.gif 
భారత్ - ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ప్రారంభమయిన సంగతి తెలిసిందే! అయితే ఇందులో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్ మెన్లు... కేవలం 145 పరుగులకే 7 వికెట్లను కోల్పోయారు. దీంతో టీమిండియా అభిమానులు చాలా నిరాశపడ్డారు. భారత్ కు అత్యధిక స్కోరును కల్పించే ఆటగాడే లేడా అనే సమయంలో అజింక్యా రహానే అద్భుతంగా ప్రదర్శించి మరోసారి తన సత్తా ఏంటో చాటుకున్నాడు.Read More.....
భారత్ పరువును కాపాడిన రహానే!

Thursday, 17 July 2014

Telangana Cm Kcr Ready Praise Ceremony To Satya Nadella


Telangana CM kcr ready praise ceremony to satya nadella.gif
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు నచ్చని పదం, నచ్చని వాడు .. ఒక్కటే.. ఆంద్ర, ఆంధ్రోడు? సీఎం కేసిఆర్ కు ఆంధ్రోడు అంటే అసలు పడదు. ఆంధ్రోళ్లు లేని తెలంగాణ కావాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు. నిత్యం ఆంధ్రోడని తిట్టందే.. కేసిఆర్ కు నిద్రపట్టదు. ఒకవేళ మరిచిపోయిన ..నిద్రలోనైన ఆంధ్రోడని కలవరిస్తాడు. ఆంధ్రోళ్లు అంటే కేసిఆర్ కు అంత ఇష్టం. అందుకే ఇటీవల.. ఆంధ్ర పిల్లలకు . తెలంగాణ ఇచ్చే ఏ రాయితీ అందకూడదని అధికారులకు క్లాస్ పీకాడు. అంతేకాకుండా.. తెలంగాణలో.. ఒక్క ఆంధ్ర ఉద్యోగి కూడా ఉండటానికి వీలులేదని ఖచ్చితంగా చెబుతున్నాడు. అలాంటి కేసిఆర్.. త్వరలో.. ఒక ఆంధ్రోనికి సన్మానం చేయటానికి సిద్దమవుతున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కి తెలంగాణ రాష్ట్రం తరుపున సన్మానం చేయటానికి ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి మిత్రుడు. ఇద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి తెలంగాణ సీఎం కేసిఆర్ సన్మానం చేయటం అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనేవరో కాదు.. తెలుగు తేజం అయిన సత్య నాదేళ్ళ. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి సంస్థ అయిన మైక్రోసాప్ట్ కు అధినేత సత్య నాదేళ్ళ. కెసిఆర్ గారు సత్య నాదెళ్ళకు సన్మానం చేయనున్నారట. అది కూడా మామూలు సన్మానం కాదు పౌర సన్మానం. అంటే ప్రవాసాంధ్రుడైన సత్యకు తెలంగాణలో గుర్తింపు ఇవ్వడం అనమాట. అంటే ఆయనను కూడా తమ వాడిగానే చేసుకున్నామని అధికారికంగా ఇవ్వడం అనమాట.

telangana-cm-kcr-satya
తాజాగా సచివాలయంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి సమావేశమై త్వరలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ హైదరాబాద్ రానున్నారని చెప్పడంతో కెసిఆర్ అండ్ కో రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే సత్య కూడా ఆంధ్రా వ్యక్తేనాన్న విషయం మరిచిపోయాడా? లేక తన అవసరాల కోసం కళ్ళు మూసుకున్నాడా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే కెసిఆర్ నిద్ర లేచింది మొదలు ఆంధ్రోడు అంటూ ఆడిపోసుకుంటాడు. అలాంటిది సత్య నాదేళ్ళకు ఎలా సన్మానిస్తాడోనని రాజకీయ నేతలు, తెలంగాణ ప్రజలు, ఆంద్ర ప్రజలు చాలా వింతగా మాట్లాడుకుంటున్నారు.

అలాంటి కెసిఆర్ ఇప్పుడు ఓ ఆంధ్రోడిని ఎలా సన్మానించి పోగడగలరు అంటూ కామెంట్స్ వేస్తున్నారు. అవసరం కోసం కెసిఆర్ ఏదైనా చేస్తారని.. సత్య విషయంలో కూడా తమకు అవసరం ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని.. ఇది కెసిఆర్ కి కొత్తేమీ కాదని.. ఇంట్లో ఆంధ్రా కోడలు, మనవడిని పెట్టుకొని కూడా అవసరం కోసం కెసిఆర్ ఆంధ్రాను ఆడిపోసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘పేకాట.. పేకాటే.. తమ్ముడు తమ్ముడే ’’ అనే సిద్దాంతాన్ని కేసిఆర్ ఫాలో అవుతున్నారని ఆంధ్ర నాయకులు అంటున్నారు. అదే సత్య కూడా మైక్రోసాఫ్ట్ అధినేత కాకుంటే ఆయన్ని కూడా కెసిఆర్ ఆంధ్రోడి గాటికి కట్టేసేవాడని రాజకీయ మేథావులు అంటున్నారు.

telangana-cm-kcr-satya-nadella


అయితే కేసిఆర్ 125 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి.. రెండు లడ్డులు తినిపించారు. అలాంటిది.. సత్య నాదేళ్ళ కు ఒక లడ్డు తినిపించటంలో పెద్ద గొప్పమేలేదని కేసిఆర్ అభిమానులు అంటున్నారు. కేసిఆర్ రాజకీయ దెబ్బకు.. సోనియా గాంధీ, జైరాం రమేష్, షిండే, చిదంబరం, లాంటి వారే..ఇప్పటికి జుట్టు పీక్కుంటున్నారు. ఈ ఆంద్రోడు ఒక లెక్క.. అనే ధీమాలో సత్యకు సన్మానం చేస్తున్నట్లు .. రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఏమైన కేసిఆర్ గ్రేట్ !!! అన్నం పెడతావ్, ఆవేశ పడతావ్, ఆంద్రోడని తిడతావ్, అంతలోనే.. ఆంద్రోడికి సన్మానం చేస్తావ్.. నీలాంటి రాజకీయ నాయకుడు ఈ చరిత్రలోనే ఉండాడు. మీ దగ్గర రాజకీయ పాఠాలు .. చాలా మంది రాజకీయ నేతలు నేర్చుకుంటే.. తెలుగు రాష్ట్రాలు త్వరగా బాగుపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘వేలేత్తి చూపేది నువ్వే.. చేతులతో కౌగిలించుకునేది నువ్వే’’ !! నీ రాజకీయ మర్మలు తెలియక చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. ముమ్మటికి కేసిఆర్ కరెక్ట్ అని.. అభిమానులు.. మరో సారి నీ పాలనే రావాలని కోరుకుంటున్నారు.

RS

kcr ready praise ceremony to staya nadella kcr, ready, praise ceremony, staya nadella, kcr cruel behavior on andhra peoples, microsoft ceo satya nadella, kcr fire comments on andhra, satya nadella telangana tour satya nadella to meet kcr next month

Ys Jagan Mohan Reddy Controversial Comments On Ap Cm Chandrababu


ys-jagan-fires-on-chandra-b.gif

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. ఈసారి కూడా చంద్రబాబునాయుడిని దూషిస్తూ కొన్ని సంచలనవ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు ఏవైతే వ్యవసాయదారులకు, మహిళలకు, వృద్ధులకు హామీలు ఇచ్చారో.. వాటిని సక్రమంగా పూర్తి చేయాలని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ అలాకాని పక్షంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేయడంలో చంద్రబాబు ఆలస్యం చేస్తున్నారని.... ఇలాగే కొనసాగితే ఉద్యమించక తప్పదని జగన్ రెడ్డి అన్నారు. రుణమాఫీల కోసం మరో వారం రోజులపాటు వేచి చూస్తామని చెప్పిన జగన్... అలా కాని పక్షంలో రైతులు మహిళలతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో వున్న జగన్ మోహన్ రెడ్డి... పంటలు నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయడం ఒక సాధారణమని విషయం అని చెప్పారు. అటువంటి సాధారణ పనిని తానే రీషెడ్యూల్ చేయిస్తున్నట్టుగా బాబు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప... ఇంతవరకు ఒరిగిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అదికారంలోకి రాగానే వెంటనే రుణాలను మాఫీ చేయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆయన ఆరోపించారు. వీలైనంత త్వరగా హామీలను పూర్తి చేయాలని, లేకపోతే ప్రభుత్వం స్తంభించిపోయేలా ఉద్యమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు.

AS
Ys Jagan Mohan reddy controversial comments on ap cm chandrababu naidu on farmer loans, ys jagan latest news, ys jagan comments on chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu news, ys jagan news, ys jagan in srikakulam, ys jagan yatra in srikakulam, ys jagan with chandrababu naidu, ys jagan fires on chandrababu naidu, ap cm chandrababu naidu latest news, ys jagan mohan reddy latest news, ys jagan news, ys jagan comments on farmer loans, ys jagan comments on dwakra loans, dwakra loans for women, farmer loans

Pawan Flexis Creates Disputes Between Jana Senaand Tdp Leaders At Guntur


pawan-flexis-creates-disputes-between-jana-senaand-tdp-leaders-at-guntur.gif
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయల్లోకి అడుగు పెట్టినప్పటికి, అధికార రాజకీయలకు కొంచెం దూరంగా ఉంటున్నాడు. ‘‘ప్రశ్న ఆయుధంగా జనం మద్యలోకి వచ్చిన జనసేన పార్టీ పై’’ తెలుగు ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు పవన్ కళ్యాణ్ పశ్నించే ప్రశ్న కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఫై కొన్ని రాజకీయ పార్టీలు..దుమ్మెత్తి పోసాయి.

మరికొన్ని పార్టీలు.. కామెంట్లు చేసిన నోటి దుల తీర్చుకున్నాయి. అయితే రీసెంట్ గా పవన్ ప్రెస్ మీట్ పెట్టి.. తెలుగు ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తింపు వచ్చిన తరువాతనే.. ప్రశ్నించటం ఉంటుందని గట్టిగా చెప్పటం జరిగింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ప్లెక్సీ పై గుంటూరులో కొత్త వివాదం రేగింది.

టీడీపీ కాపు నేతలు పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. నగరంలోని టీడీపీకి చెందిన కొంతమంది కాపు నేతలు పవన్‌ కల్యాణ్‌, జనసేన పేరుతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విజయం సాధించిన కాపు జేడ్పీటీసీలు, ఎంపీటీసీలకు తన్నీరు కిషోర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ను కులం రొంపిలోకి దించేందుకు కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనీ, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు. నగరంలో కులం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు.

RS

pawan kalyan flexis fight in guntur, pawan  flexis war in guntru,  janasena leaders fire on tdp leaders, janasena vs tdp, pawan comments on tdp,  pawan kalyan flexis crea,pawan kalyan, pawan press meet, pawan kalyan latest news, pawan kalyan latest speech,  chiranjeevi,pawan kalyan, -pawan kalyan movie latest news, pawan kalyan punch dialogues, pawan kalyan heavy punch, pawan punch dialogues, pawan kalyan dialogues,, pawan kalyan, janasena, punch dialogues, jana sena party.