గత కొన్ని రోజుల నుండి తెలంగాణ అంశాన్ని
నాన్చుతూ, పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నామధ్యన ఆఘమేఘాల మీద
అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అప్పడు ఏమీ చెప్పకుండా నెలరోజుల్లో
తేలుస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిపంపించారు. అయితే ఇన్ని
రోజులు ఎటూ తేల్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో ఎలా తేలుస్తుందని
అందరికి అనుమానాలు వచ్చాయి. అందరు అనుకున్నట్లే హోమంత్రి అసలు రంగు
బయటపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై కాంగ్రెస్ చేతులెత్తేస్తూ... యుపీఏ
భాగస్వామ్యపక్షాలను దీనిపై అభిప్రాయాలు కోరగా, తమ రాష్ట్రాల్లో ఉన్న విభజన
వాదానికి తెలంగాణ ఏర్పాటు మరింత ఊతం ఇస్తుందని, అది రాజకీయంగా తమకు
ఇబ్బంది అని స్పష్టం చేశాయని గురువారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్
కమిటీలో సోనియాగాంధీ సభ్యు లకు వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు కట్టుబడి
ఉన్నామన్న షిండే ప్రకటన, పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయమే అయినప్పటికీ,
ప్రస్తుత పరిస్థితిలో భాగస్వామ్యపక్షాలను కాదని ఏమీ చేయలే మని
వ్యాఖ్యానించారు.
అందువల్ల గూర్ఖా తరహాలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ, ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుచేయడమే
ప్రత్యామ్నాయ పరిష్కార మార్గమని సోనియా అభిప్రాయపడినట్లు సమాచారం. మిగిలిన
వారు కూడా ఈ నిర్ణయానికే తలూపినట్లు తెలుస్తుంది. దీనికోసం విజయవాడలో
ప్రాంతీయ సమావేశం కూడా వాయిదా వేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది. ఈ
నిర్ణయ ప్రభావం దానిపై పడితే అది తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్టవుతుందన్న
అభి ప్రాయం వ్యక్తమయింది. అక్కడ సీమాంధ్రులు సంబ రాలు చేసుకుంటే తెలంగాణ
నేతలను రెచ్చగొట్టి నట్టవుతున్నందున, అది వాయిదా వేయాలని సూచిం చారు.
వెంటనే ఆజాద్ పీసీసీ చీఫ్ బొత్సకు ఫోన్ చేసి ప్రాంతీయ సభ వాయిదా వేయాలని
ఆదేశించారు. ఆ ప్రకారంగా పదిరోజుల్లో ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించారు.
మొత్తానికి కాంగ్రెస్ అసలు రంగు ఇది అని మరోసారి నిరూపించారని రాజకీయ
విశ్లేషకులు అంటున్నారు.
No comments:
Post a Comment