క్రికెట్ రంగంలో భారతమాత
ముద్దుబిడ్డగా దేశ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపచేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు ఇప్పడు ఆ బాధ్యత తీసుకోబోతున్నాడు. సచిన్ కుమారుడు
అర్జున్ తెండూల్కర్కు తాజాగా ముంబయి అండర్-14 జట్టులో స్థానం లభించింది.
బిసిసిఐ ఆధ్వర్యంలో జరిగే వెస్ట్జోన్ విభాగం మ్యాచ్లు అహ్మదాబాద్లో ఈనెల
20 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ముంబయి జట్టులో
13 ఏళ్ల అర్జున్కు చోటు దక్కింది. ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్గా
రాణిస్తున్న అర్జున్ ఇటీవల గోర్గాన్ సెంటర్తో జరిగిన మ్యాచ్లో ఖార్
జింఖానా తరఫున 124 పరుగులు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ పిడుగు
భారత క్రికెట్ లో ఏం సంచలనాలు చేస్తాడో అని యావత్ దేశం ఆసక్తిగా
ఎదురుచూస్తుంది. ఈ శుభ సందర్భంలో తెలుగువిశేష్.కాం అర్జున్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది..
...avnk
No comments:
Post a Comment