ఈ
నెల 28న తెలంగాణ సమస్య పై కేంద్రం ఒక ప్రకటన చేయనుంది? అఖిలపక్ష
సమావేశంలో కేంద్రం నెల రోజుల సమయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే
ఇప్పుడు తెలంగాణ నాయకులు , ఇటు సీమాంద్ర నాయకులు , తమ మనసులోని మాటలను
గళంవిప్పి మాట్లాడుతున్నారు. సమైక్యాంద్ర మేం సిద్దమని సీమాంద్ర నాయకులు
అంటున్నారు. రాయల సీమ నాయకులు మా గురించి ముందు చెప్పిన తరువాతనే తెలంగాణ
ఇవ్వమని రాయల సీమ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మూడు
ముక్కలాట జరుగుతుంది. కేంద్రం మాత్రం తమ నిర్ణయం 28న చెప్పాటానికి
సిద్దమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ నాయకులు సమాచారం బట్టి కేంద్రం
తెలంగాణకు అనుకూలంగా ఉందని కొంతమంది నాయకులు లీక్ చేశారని మీడియా వారు
అంటున్నారు. లీక్ అయిన సమాచారంతో మూడు ప్రాంతాల ప్రజా నాయకులు తర్జన
భర్జన పడుతున్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలితంగా చేస్తే బాగుంటుందని
కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విషయం పై తెలంగాణ
నాయకులు మండిపడుతున్నారు.
ఈ విషయం పై సీమాంద్ర నాయకులు సమావేశం అయ్యి, తమ
ఢిల్లీ నాయకుల వద్ద వినిపించటానికి రెఢీ అవుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర
రాజకీయ నాయకుల్లో అనేక ప్రశ్నలు? ఒకవేళ తెలంగాణ ఇస్తే? సీమాంద్రలో
రాజధాని ఎక్కడ? ఈ విషయం తెల్చకుండా తెలంగాణ ఎలా ఇస్తారు? తెలంగాణ
ఇస్తే సీమాంద్ర నాయకులు రాజీనామాలు చేస్తారా? మూడు ప్రాంతాల ప్రజలకు,
నాయకులకు కేంద్రం ఎలా న్యాయం చేస్తుంది? తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి
ఏమిటి? 2014లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? సీమాంద్ర నాయకులు
రాజీనామాలు చేస్తే ఏ రాజకీయ పార్టీకి లాభం? ఇలాంటి ప్రశ్నలతో రాజకీయ
నాయకులు బీజిబీజిగా ఉన్నారు. అయితే రాష్ట్రం విడిపోతే మాత్రం రాజధాని
ఎక్కడ అనే ప్రశ్న సీమాంద్ర నాయకుల్లో ఎక్కువుగా బాధిస్తుంది.
అయితే
ముఖ్యంగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి? కర్నూల్, విశాఖపట్నం, విజయవాడ,
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పేర్లు నాయకుల మధ్య
వినిపిస్తున్నాయి. రాయల సీమ నాయకులు, గతంలో రాజదాని కర్నూల్ లో ఉంది
కాబట్టి, కర్నూల్ రాజధాని అయితే రాయల సీమ ప్రజలు , నాయకులు అంటున్నారు,
రాజధాని గా విశాఖ పట్నం చాలా అనువైన జిల్లాగా ఆ ప్రాంత నాయకులు
అంటున్నారు. విశాఖ ఇప్పటికే అన్ని రంగాలలో ముందంజలో ఉందని ఆ ప్రాంత
నాయకులు అంటున్నారు. అంతేకాకుండా రాజధాని కావాలసి భూమి, అన్ని సౌకర్యాలు,
విమానాశ్రయం, పోర్టు , ప్యాక్టరీలు అన్ని అక్కడే ఎక్కుగా ఉన్నాయి,
అంతేకాకుండా, ఉభయ గోదావరి జిల్లాలకు , కోస్తా జిల్లాలకు అభివ్రద్ది
బాటలోకి వస్తాయని ఆ ప్రాంత నాయకులు అంటున్నారు. క్రిష్ణనది, అందుబాటలో
ఉంది కాబట్టి విజయవాడ, చాలా అనుకూలంగా ఉందని విజయవాడ నాయకులు అంటున్నారు.
గుంటూరు నాయకులు మాత్రం రాజధాని గుంటూర్లో అయితే ఇటు రాయల సీమ
ప్రజలకు, అటు శ్రీకాకుళం ప్రజలకు మధ్య రాజధాని ఉంటుంది, విశాఖలో రాజధాని
అయితే, రాయల సీమ ప్రజలకు చాలా దూరం అవుతుందని గుంటూరు నాయకులు
అంటున్నారు. ప్రకాశం జిల్లా నాయకులు మాత్రం అభివ్రుద్ది విషయంలో చాలా
వెనబడిన ప్రాంతం కనుక, రాజధానికి కావాలసిన భూమి ప్రకాశంలో జిల్లల్లో
ఎక్కువుగా ఉంది, కాబట్టి రాజదాని ఒంగోలు ప్రాంతంలో ఉంటే అటూ రాయల సీమ
ప్రజలకు, ఈ శ్రీకాకుళం, విశాఖ పట్టణం ప్రజలకు సమానా దూరంలో ఉంటుందని
ఆప్రాంత నాయకులు, ప్రజలు చెబుతున్నారు. నెల్లూరు , తిరుపతి విషయంలో రాయల
సీమ ప్రజలు, నాయకులు నెల్లూరు, తిరుపతి వైపే మెగ్గు చూపుతున్నారు. తిరుపతి
లో రాజధాని ఉంటే, అటు తమిళనాడుకు, ఇటు బెంగుళూర్ కు , దగ్గర ఉంటుందని
వారు అంటున్నారు, అంతేకాకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం
చేసేకొనే అవకాశం ఉంటుందని, రాజధాని కోసం భూమి గానీ, దాని అయ్యే ఖర్చు
పెట్టుకోవటానికి తిరుపతి ప్రజలు, నాయకులు సిద్దంగా ఉన్నారని ఆ ప్రాంత
నాయకులు అంటున్నారు.
అసలు
రాజధాని పెట్టడాలంటే ఏం కావాలి. రాజధాని వలన ఎవరికి లాభం? రాజదానితో
ప్రజలకు సంబంధం ఉంటుందా? రాజధాని కావాలసిన పరిస్థితులు ఏమిటి? రాజధాని
పెట్టడం వలన చుట్టు ప్రక్కల ప్రాంతలు అభివ్రుద్ది చెందుతాయి? మౌళిక
సదుపాయలు అన్ని ప్రాంతల ప్రజలకు అందుబాటులో ఉంటాయి? వ్యాపార రంగం
అభివ్రుద్ది చెందటానికి అవకాశం ఉంది? రాజధానికి అనువైన ప్రభుత్వవ భూమి
కావాలి? అందుకు మంచి నీటి వసతి ఉండాలి? రోడ్డు రవాణ సౌకర్యం, ఎయిర్
పోర్టు, అందుబాటులో ఉండాలి? వరదలకు, తుఫాన్ తాకిడికి దూరంగా ఉండాలి?
ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అవుతుందని రాజకీయ
విశ్లేషకులు అంటున్నారు. అయిన అదేదో సామెత మాదిరిగా అలు ... లేదు..
చూలూ లేదు .. కొడుకు పేరు సోమ లింగం అన్నట్లు ఉంది ? రాష్ట్రం
విడిపోకముందే రాజకీయ నాయకులు ఇలా మరో రాజధాని గురించి మాట్లాడుకోవటం
విడ్డురంగా ఉంది కదూ? రాజధాని ఏర్పాటు చేయలంటే .. కొన్ని కోట్లు ఖర్చుతో
కూడిన పని. అసలు విషయం తెలియాలంటే ఈ నెల 28 వరకు ఆగాల్సిందే....
No comments:
Post a Comment