
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. విజయవాడ చుట్టూనే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని అన్నిప్రాంతాలవారికి అందుబాటులో ఉండే విధంగా మద్యలో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చంద్రబాబు ఇరవై పేజీల ప్రకటన చేశారు. జిల్లాలవారిగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
రాజధానిపై అసెంబ్లీలో రెండ్రోజులుగా నడుస్తున్న గందరగోళం మద్యే చంద్రబాబు ప్రకటన చేశారు. రెండవ వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యుల ఆందోళనల మద్య రాజధానిపై ప్రకటన చేశారు. ఈనెల 1న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం విజయవాడ పరిసరాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ప్రధానమైన భూ సేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తన్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment