ఢిల్లీలో
వైద్య విద్యార్థి పై జరిగిన గ్యాంగ్ రేప్ నిరసనగా గత మూడు రోజులు నుండి
ఢిల్లీలో నిరసన సెగ రగిలిపోతుంది. ఈ సెగను నివారించటానికి పోలీసులు ఎంత
ప్రయత్నం చేసినప్పటికి ఫలితం సాధించలేకపోయారు. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి
సుశీల్ కుమార్ షిండే, ఆందోళన కారులకు చెక్ పెట్టే దిశగా ఆయన అడుగులు
వేస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన కారులు ఇండియా గేటు వద్దకు చేరుకోవడాన్ని
ఉపయోగించే దారులపై షిండే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వారిని
నివారించటానికి ఢిల్లీలో ఉన్న 9 మెట్రో రైలు స్టైషన్లను మూసివేశారు. ఇలా
చేయటంతో విద్యార్థులు, ఆందోళన కారులు, ఇండియా గేట్ వద్దకు చేరుకోవటం చాలా
కష్టమని ప్రభుత్వం భావిస్తుంది.
ఇప్పటివరకు ప్రగతి మైదాన్, రాజీవ్ చౌక్, ఉద్యోగ్ భవన్ , రేస్ కోర్సు
లాంటి రద్దీగా ఉండే స్టేషన్లు మూసివేయడంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది
పడుతున్నారు. హొంశాఖ మంత్రి ఇలా చేయటం ఢిల్లీ ప్రజలు మండిపడుతున్నారు.
షిండే చర్యలు ‘‘ తలనొప్పిగా ఉంది అంటే మోకాలికి మందు రాస్తే తలనొప్పి తగ్గుతుందా? ’’ అనే
విధంగా ఉందని ప్రజలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మహిళల రక్షణ
కోసం ఉద్యమం చేస్తూంటే, రక్షణ చర్యలు తీసుకోకుండా, ఢిల్లీలో కొత్త
సమస్యలు తలెత్తే విధంగా షిండే ప్రవర్తిస్తున్నారని ఢిల్లీ సామాన్య ప్రజలు
వాపోతున్నారు.
No comments:
Post a Comment